స్పీడ్ నుంచి హై స్పీడ్ కు చేరుకున్నాం - ప్రధాని మోడీ

.

Last Updated : Sep 29, 2017, 06:37 PM IST
స్పీడ్ నుంచి హై స్పీడ్ కు చేరుకున్నాం - ప్రధాని మోడీ

గుజరాత్: బుల్లెట్ రైలును భారత్ దేశానికి  జపాన్ అందిస్తున్న గిఫ్ట్ గా ప్రధాని మోడీ అభివర్ణించారు. అహ్మదాబాద్ లో జరిగిన బుల్లెట్ రైలు శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో  భారత ప్రధాని  ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ బుల్లెట్ ట్రైన్ తో మనం స్పీడ్ నుంచి హైస్పీడ్ కు చేరుకున్నట్లయిందన్నారు.  అభివృద్ధి విషయంలోనూ బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా బుల్టెన్ ట్రైన్ విషయంలో జపాన్ అందిస్తున్న సహకారానికి ఆ దేశ ప్రధాని షింజో అబే కు  మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో గుజరాత్ , మహారాష్ట్ర ముఖ్యమంత్రులు మంచి తోడ్పాటును అందిస్తున్నారని  ప్రధాని మోడీ వారిని  అభినందించారు.

Trending News