ఉత్కంఠ భరిత పోరులో బీజేపీయేతర కూటమి పైచేయి

                            

Last Updated : May 31, 2018, 12:11 PM IST
ఉత్కంఠ భరిత పోరులో బీజేపీయేతర కూటమి పైచేయి

దేశ వ్యాప్తంగా వివిధా కారణాల వల్ల ఖాళీ అయిన నాల్గు ఎంపీ, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం  కాంగ్రెస్ 8 స్థానాల్లో ముందజంలో ఉండగా బీజేపీ కేలవం ఒక స్థానంలో మాత్రమే ముందంజలో ఉంది .కాగా ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.  ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే మొత్తం నాలుగు ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ 3 స్థానాల్లో ముందంజలో ఉండగా.. బీజేపీ కేవలం స్థానంలో మాత్రమే ముందంజలో ఉంది. తాజా పరిణామాలు అధికార పార్టీ బీజేపీని  కాస్త నిరుత్సాహాన్ని కల్గిస్తుండగా కాంగ్రెస్ తో పాటు బీజేపీయేతర పక్షాల్లో ఉత్సాహాన్ని ఇస్తోంది. అయితే అంతిమ ఫలితం వచ్చే వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ గెలుపుపై ఎవరి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Trending News