టీఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌కే మద్దతు: మల్లు రవి

టీఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌కే మద్దతు: మల్లు రవి

Last Updated : May 19, 2019, 10:00 AM IST
టీఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌కే మద్దతు: మల్లు రవి

హైదరాబాద్: ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 220 లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ మల్లు రవి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని చెబుతూనే టీఆర్‌ఎస్‌ సహా అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాయని, కాంగ్రెస్ పార్టీ సైతం అన్ని పార్టీల మద్దతు తీసుకుంటుందని తెలిపారు. అయితే, తెలంగాణలో అందరికన్నా కాంగ్రెస్ పార్టీనే అధిక స్థానాలు సొంతం చేసుకుంటుందని మల్లు రవి ఆశాభావం వ్యక్తంచేశారు. 

బీజేపి నేతలపై విమర్శలు ఎక్కుపెట్టిన మల్లురవి.. ప్రధాని నరేంద్ర మోదీని ఏవైనా ప్రశ్నలు అడిగితే ప్రధాని స్పందించాల్సిందిపోయి బీజేపి అధ్యక్షుడు అమిత్‌ షా స్పందిస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ప్రధాని మోదీ మాటతీరు, రాహుల్‌ గాంధీ మాట తీరుకు చాలా తేడా ఉందని, ప్రజలు రాహుల్‌కే పట్టంకడతారని మల్లు రవి జోస్యం చెప్పారు.

ఇదిలావుంటే, ఓవైపు కాంగ్రెస్ పార్టీ పేరెత్తితేనే టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా కేంద్రంలో బీజేపీయేతర, కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తీవ్రంగా కృషి చేస్తోన్న టీఆర్ఎస్ పార్టీ మల్లు రవి చేసిన ఈ ప్రకటనపై ఏ విధంగా స్పందిస్తుందే వేచిచూడాల్సిందే మరి.

Trending News