Road accident: 9 మందిని బలిగొన్న ఘోర రోడ్డు ప్రమాదం

UP road accident ప్రతాప్‌ఘడ్ : ఉత్తర్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతాప్‌ఘడ్ జిల్లా వాజిద్‌పూర్‌లో ఓ కంటైనర్ ట్రక్కు మరో ఎస్‌యువి వాహనం ఎదురెదురుగా వచ్చి ఒకదానినొకటి బలంగా ఢీ కొన్న ఘటనలో 9 మంది చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ( Truck collided with SUV ).

Last Updated : Jun 5, 2020, 12:55 PM IST
Road accident: 9 మందిని బలిగొన్న ఘోర రోడ్డు ప్రమాదం

UP road accident ప్రతాప్‌ఘడ్ : ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతాప్‌ఘడ్ జిల్లా వాజిద్‌పూర్‌లో శుక్రవారం ఉదయం ఓ కంటైనర్ ట్రక్కు మరో ఎస్‌యువి వాహనం ఎదురెదురుగా వచ్చి ఒకదానినొకటి బలంగా ఢీ కొన్న ఘటనలో 9 మంది చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ( Truck collided with SUV ). మృతులలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నారు. ట్రక్కు వేగంగా వచ్చి కారును బలంగా ఢీకొనడంతో చనిపోయిన వారి మృతదేహాలు వాహనంలోనే చిక్కుకుపోయాయి. దీంతో గ్యాస్ కట్టర్లు ఉపయోగించి వాహనంలోంచి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎస్‌యూవీ కారు ( SUV car ) డ్రైవర్‌ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఎస్‌యూవీ కారులో ఉన్న వాళ్లలో డ్రైవర్ మినహా మిగతా 9 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వారు రాజస్థాన్ నుంచి బిహార్‌కి వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

(Tablighi Jamaat: తబ్లిగి జమాత్‌ విదేశీ సభ్యులకు మరో కోలుకోలేని షాక్ ఇచ్చిన భారత్ )

ఈ దుర్ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( UP CM Yogi Adityanath ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులకు అండగా నిలుస్తామని యోగి సర్కార్ ప్రకటించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News