Covid19: కేంద్రమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

కేంద్ర హోంశాఖ మంత్రి , బీజేపీ అగ్రనేత అమిత్ షాకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించడమే కాకుండా..తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Last Updated : Aug 2, 2020, 05:41 PM IST
Covid19: కేంద్రమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

కేంద్ర హోంశాఖ మంత్రి , బీజేపీ అగ్రనేత అమిత్ షాకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించడమే కాకుండా..తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని...వైద్యుల సూచనల మేరకు ఆస్పత్రిలో చేరానని అమిత్ షా చెప్పారు. ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారు గానీ, కాంటాక్ట్ లో ఉన్నవారు గానీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని స్వయంగా అమిత్ షా ట్వీట్ ద్వారా వెల్లడించారు.

Trending News