దేశ వ్యాప్తంగా విశాఖ తరహా రైల్వే జోన్ల డిమాండ్లు !

                                                     

Last Updated : Jul 2, 2018, 06:03 PM IST
దేశ వ్యాప్తంగా విశాఖ తరహా రైల్వే జోన్ల డిమాండ్లు !

విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ మాదిరిగానే దేశ వ్యాప్తంగా పలు చోట్ల రైల్వే జోన్ల డిమాండ్లు ఊపందుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో రైల్వే జోన్ ల కోసం  డిమాండ్  వస్తున్నాయి. గత నాలుగేళ్ల కాలంలో  170కిపైగా  ప్రాంతాల్లో ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్లు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీని కోసం అనేక మంది ప్రముఖలు రైల్వేశాఖకు లేఖలు రాసినట్లు రైల్వేశాఖ పేర్కొంది. 

రైల్వే జోన్ కోరిన వారిలో బీజేపీ కురువృద్ధుడు అద్వానీతో పాటు  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, క్రికెటర్ రాజ్యసభ్యుడు సచిన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఉండటం గమనార్హం.

ఎల్ కే అద్వానీ గుజరాత్ లో కొత్త రైల్వే జోన్ ఏర్పాడు చేయాలని కోరగా..సచిన్ ముంబై సబర్బన్ రైల్వే జోన్ ..యూపీ సీఎం యోగి గోరఖ్ పూర్ రైల్వే డివిజన్, కేంద్ర మంత్రి గడ్కరీ నాగపూర్ రైల్వే జోన్, కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ తిరువనంతపురం రైల్వే జోన్ల డిమాండ్ చేశారు.

Trending News