Indian evacuation: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు షురూ- బయల్దేరిన తొలి విమానం!

Indian evacuation: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ భయాల నేపథ్యంలో.. ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా తొలి విమానం రొమానియా నుంచి బయల్దేరింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2022, 04:06 PM IST
  • ఉక్రెయిన్​ వెనక్కి వచ్చేస్తున్న భారతీయులు
  • రొమానియా బయల్దేరిన తొలి విమానం
  • ఇంకా వందలాది మంది ఇండియా వచ్చేందుకు ప్రయత్నాలు
Indian evacuation: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు షురూ- బయల్దేరిన తొలి విమానం!

Indian evacuation: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా భారత్​కు తరలించే ప్రయత్నాల్లో భారత్ మరో ముందడుగు వేసింది. ఉక్రెయిన్ సమీప దేశమైన రొమానియా నుంచి 219 మందితో తొలి విమానం.. ముంబయికి బయల్దేరింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జయ్​శంకర్​ తెలిపారు.

యుద్ధ భయాలతో..

రష్యా- ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్​లోని సైనిక స్థావరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుందో. రాజధాని నగరంపై కూడా బాంబు దాడులో చేస్తోంది రష్యా. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్​లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. అందుకే భారతీయులను సురక్షితంగా రక్షించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేసింది.

ఉక్రెయిన్ గగనతలం మూసేసిన కారణంగా.. ఆ దేశానికి సమీపంగా ఉన్న ఇతర దేశాల నుంచి భారత పౌరులను స్వదేశానికి రప్పిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా.. 219 మంది భారతీయులతో ఎయిర్​ ఇండియా విమానం.. రొమానియా నుంచి ముంబయికి బయల్దేరింది. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులే కావడం గమనార్హం.

నిజానికి ఉక్రెయిన్ గగన తలం మూసేయకుంటే.. 24 నుంచి 26 వరకు ఇండియా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్​ మధ్య మూడు విమానాలను నడిపి భారతీయులను వెనక్కి రప్పించాలని భావించింది. అయితే అంతలోనే గగనతలం మూసేయడంతో.. ప్లాన్​ బీ అమలు చేస్తోంది.

ఇంకా వందలాది మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తొంది ప్రభుత్వం.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విదేశాంగ మంత్రి జయ్​శంకర్​.. భారతీయులను రప్పించే ప్రయత్నాల్లో ముందడుగు పడిందని చెప్పారు.

ఇందుకోసం కేటాయించిన బృందాలు నిరంతరయంగా ప్రయత్నాలు జరుపుతున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియను స్వయంగా తానే పరిశీలిస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.

ఉక్రెయిన్​లో మొత్తం 20 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువశాతం విద్యార్థులే.

Also read: Indians in Ukraine: ప్రభుత్వ ఖర్చుతో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి భారతీయులు!

Also read: Russia Ukraine War: రష్యా యుద్ధ తంత్రం.. మోదీ సాయం కోరిన ఉక్రెయిన్.. జోక్యం చేసుకుంటారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News