400 మంది పనిచేస్తోన్న చిప్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం!!

400 మంది పనిచేస్తోన్న చిప్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం!!

Last Updated : Nov 4, 2018, 05:18 PM IST
400 మంది పనిచేస్తోన్న చిప్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం!!

400 మంది కార్మికులు పనిచేస్తున్న ఓ చిప్స్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం ఓ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ లో సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో చిప్స్ ఫ్యాక్టరీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన సమయంలో లోపలే ఉన్న కార్మికులను సిబ్బంది సురక్షితంగా బయటికి తరలించారు.

ఫ్యాక్టరీలో ఉన్న వస్తు సామాగ్రి, నిల్వలు అన్నీ చిప్స్ తయారికి సంబంధించినవి కావడంతో అగ్నికి మరింత ఆజ్యం పోసినట్టయింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ బయట స్టాక్ తరలించడానికి సిద్ధంగా ఉన్న పలు లారీలు సైతం కాలి బూడిదైనట్టు తెలుస్తోంది.

ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పే పనిలో నిమగ్నమయ్యారు. 

Trending News