POKలో ఉగ్రస్థావరాలు ఖతం

భారత ఆర్మీ జవానులు మరోసారి  పై చేయి సాధించారు. పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్..POKలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను నాశనం చేశారు. సరిహద్దుల్లో ముష్కర మూకలు ఏర్పాటు  చేసుకున్న ఈ  స్థావరాల కారణంగా .. భారత్ కు నిత్యం ప్రమాదం పొంచి ఉంది.

Last Updated : Apr 11, 2020, 03:53 PM IST
POKలో ఉగ్రస్థావరాలు ఖతం

భారత ఆర్మీ జవానులు మరోసారి  పై చేయి సాధించారు. పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్..POKలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను నాశనం చేశారు. సరిహద్దుల్లో ముష్కర మూకలు ఏర్పాటు  చేసుకున్న ఈ  స్థావరాల కారణంగా .. భారత్ కు నిత్యం ప్రమాదం పొంచి ఉంది. 

భారత సరిహద్దుల్లో  చొచ్చుకురావడం .. దేశంలో  ఉగ్రదాడులకు పాల్పడడం.. చేస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు .. గత కొద్దికాలంగా ఏకంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్  లో లాంచ్ ప్యాడ్ లు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి నిరంతరం భారత ఆర్మీపై, సరిహద్దు గ్రామాలపై దాడులు చేస్తున్నారు. 

ఐతే ముష్కర మూకలను నిరంతరం  భారత ఆర్మీ వెనక్కి తరిమికొడుతోంది. నిన్న ఏకంగా ఉగ్రవాదులకు  సంబంధించిన లాంచ్ ప్యాడ్ లను లక్ష్యంగా చేసుకుని భారత సైనికులు  కాల్పులు జరిపారు. దీంతో వారి లాంచ్ ప్యాడ్లు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన ఓ వీడియోను భారత ఆర్మీ విడుదల  చేసింది. ఇందులో భారత సైనికులు టార్గెట్ చేసిన లాంచ్  ప్యాడ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి ధ్వంసమైన తీరును కూడా చూడవచ్చు.

 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News