Fighter jets: యుద్ధవిమానాల కొనుగోలుకు పచ్చజెండా

భారత చైనా సరిహద్దు వివాదం, ఉద్రిక్తతల నేపధ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరిన్ని యుద్ధవిమానాల్ని కొనుగోలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ నిర్ణయంతో భారత్ త్వరలో 12 సుఖోయ్ ఫైటర్ జెట్స్ ను కొనుగోలు చేయనుంది. 

Last Updated : Jul 2, 2020, 05:53 PM IST
Fighter  jets: యుద్ధవిమానాల కొనుగోలుకు పచ్చజెండా

భారత చైనా సరిహద్దు ( Indo china border dispute )  వివాదం, ఉద్రిక్తతల నేపధ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరిన్ని యుద్ధవిమానాల్ని కొనుగోలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ నిర్ణయంతో భారత్ త్వరలో 12 సుఖోయ్ ఫైటర్ జెట్స్ ను కొనుగోలు చేయనుంది. 

తూర్పు లడ్డాఖ్ ( East ladakh )  లోని గల్వాన్ లోయ ( Galwan valley ) లో జరిగిన ఇండో చైనా సైనికుల ఘర్షణ కీలక మార్పులకు కారణమవుతోంది. రెండ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులతో పాటు యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో భారత త్రివిధ బలగాల్ని బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ప్రభుత్వం. ముఖ్యంగా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ( DAC ) ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 21 మిగ్ 29 యుద్దవిమానాలు, 59 ఎంఐజీ 29 జెట్స్ ను ఆధునీకరించేందుకు పచ్చజెండా ఊపింది. అంతేకాకుండా ప్రతిపాదన దశలో ఉన్న 12 సుఖోయ్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అనుమతులతో 12 ఎస్ యూ 20 ఎంకేఐ లను వాయుసేన కొనుగోలు చేయనుంది. సుఖోయ్ విమానాల ( Sukhoi fighter jets ) కొనుగోలు  నిమిత్తం 10 వేల 7 వందల  కోట్లు ఖర్చు చేయనుండగా...ఆధునీకరణ నిమిత్తం 7 వేల 4 వందల కోట్ల రూపాయల్ని వెచ్చించనున్నారు. Also read: Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మోదీ

వాస్తవానికి ఫైటర్ జెట్స్ కొనుగోలు, ఆధునీకరణ కోసం చాలాకాలంగా వాయుసేన ( Airforce )  అభ్యర్దిస్తోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ( Minister Rajnath singh )  అధ్యక్షతన జరిగిన డీఏసీ ( DAC) మొత్తం 38 వేల 9 వందల కోట్ల రూపాయల బడ్జెట్ ను ఆమోదించింది. ఇందులో ఆయుధ సామగ్రి, రక్షణ పరికరాల కొనుగోలు ఉన్నాయి. వీటిలో 31 వేల 130 కోట్ల విలువైన సామగ్రి మాత్రం ఇండియన్ పరిశ్రమల్నించే కొనుగోలు చేస్తారు. Also read: Botswana Elephants Deaths : ఆఫ్రికాలో 350 ఏనుగుల మరణం.. అంతుచిక్కని కారణం

ఈ కొనుగోలు పూర్తయితే భారత వాయుసేనలోని ఫైటర్ జెట్స్ విభాగం మరింతగా బలమవుతుంది. ఇక ఇప్పటికే రాఫెల్ యుద్దవిమానాల ( Rafale Fighter jets )  రాకతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శక్తివంతంగా మారింది. చైనాతో యుద్దం ప్రారంభమైతే అన్నివిదాలుగా సంసిద్ధంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

Trending News