ఆధార్-సిమ్ అనుసంధానం ఈజీ

          

Last Updated : Nov 16, 2017, 11:09 AM IST
    • ఓటీపీ ప్రతిపాదనకు ఒకే
    • డిసెంబర్ 1 నుంచి అమలు
    • ఇంటి నుంచే అనుసంధానం చేసుకోవచ్చు
ఆధార్-సిమ్ అనుసంధానం ఈజీ

ఆధార్ తో సిమ్ అనుసంధానం ఇక ఈజీ కానుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి మొబైల్ నెంబర్ తో ఆధార్ అనుసంధానం చేసుకునే  విధంగా వెసులుబాటు కలిపిస్తున్నట్లు యుఐడిఏఐ పేర్కొనింది. ఓటీపీ ఆధారిత సిమ్ కార్డు వెరిఫికేషన్ కు అనుమతి ఇస్తున్నట్లు  యుఐడిఏఐ సీఈఓ అజయ్ భూషణ్ పాండే  చెప్పారు. టెక్కోలకు కస్టమర్లు సమర్పించిన బ్లూ ప్రింట్లకు అనుమతి ఇచ్చామని, డిసెంబర్ 1వ తేదీ నుంచి ఓటీపీ ద్వారా సిమ్ కార్డు వెరిఫికేషన్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.  తాజా విధానంతో మొబైల్ యూజర్లు ఇంటివద్ద నుంచే యాప్, ఓటీపీ, ఐవిఆర్ఎస్ ద్వారా ఆధార్ లింక్ చేసుకోవచ్చు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x