MP Government: మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎవరు ఊహించినది..

MP Government: మన దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని సంచనల నిర్ణయాలు తీసుకోవడంలో ముందు వరుసలో ఉంటాయి. ఈ కోవలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అది కూడా ఏ దేశ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 17, 2024, 10:25 AM IST
MP Government: మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎవరు ఊహించినది..

MP Government: మధ్యప్రదేశ్‌ లోని మోహన్ యాదవ్  ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మన దేశంలో క్లీన్‌ సిటీ గా వున్న, ఇండోర్‌లో బిచ్చగాళ్లకు  బిచ్చం కానీ ధర్మం వేస్తే ఇక నుంచి కేసు పెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశంలో అత్యంత  క్లీన్‌  సిటీగా ఉన్న ఇండోర్ ను  బిచ్చగాళ్ల రహితంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

Add Zee News as a Preferred Source

రోడ్లపై యాచకులు లేకుండా కఠిన చర్యలకు మధ్యప్రదేశ్ ​ప్రభుత్వం దిగుతోంది. సిటీలో భిక్షాటనను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపింది. కొత్త రూల్‌  జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. సిటీలో ఎవరైనా యాచించినా.. యాచకులకు బిచ్చం వేసినా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.

ఈ మేరకు ఇండోర్‌ సిటీ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్ పట్టణాన్ని యాచకుల రహితంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అతి త్వరలో  ఈ ప్రాజెక్ట్​ను ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ఇండోర్, లక్నో, ముంబై,హైదరాబాద్, నాగ్‌‌పూర్,పాట్నా,అహ్మదాబాద్ వంటి 10 నగరాల్లో అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News