మోడీ 'న్యూ ఐడియా ఆఫ్ ఇండియా' - జపాన్ ప్రధాని షింజో అబే

.

Last Updated : Sep 15, 2017, 04:32 PM IST
మోడీ 'న్యూ ఐడియా ఆఫ్ ఇండియా' - జపాన్ ప్రధాని షింజో అబే

గుజరాత్ : జపాన్‌కు భారత్ వ్యూహాత్మక మిత్ర దేశమని ఆ దేశ ప్రధాని షింజో అబే పేర్కొన్నారు. అహ్మదాబాద్ లో జరిగిన బుల్లెట్ రైలు శంకుస్థాపనకు హాజరైన జపాన్ ప్రధాని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం 100 మంది ఇంజినీర్లు జపాన్ నుంచి భారత్ కు వచ్చారని వెల్లడించారు. జపాన్ టెక్నాలజీ తోడైతే భారత్ ప్రపంచ కర్మాగారంగా తయారౌతుందన్నారు. భవిష్యత్తులో భారత్ కు మరింత టెక్నాలజీని ఇచ్చేందుకు జపాన్ సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుత భారత ప్రధాని న్యూ ఐడియా ఆఫ్ ఇండిగాయ నిలుస్తారని ఈ సందర్భంగా మోడిని జపాన్ ప్రధాని షింజో అబే  కొనియాడారు.

Trending News