ప్రణబ్‌కు రాష్ట్రపతి, ప్రధాని పలువురు ప్రముఖుల నివాళులు

మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్‌ ముఖర్జీకి 10 రాజాజీమార్గ్‌లోని తన అధికారిక నివాసంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ముందుగా రక్షణ అధికారులు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంజలి ఘటించారు.

Last Updated : Sep 1, 2020, 01:41 PM IST
ప్రణబ్‌కు రాష్ట్రపతి, ప్రధాని పలువురు ప్రముఖుల నివాళులు

Narendra Modi Pays Last Respects to Pranab Mukherjee: న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్‌ ముఖర్జీకి 10 రాజాజీమార్గ్‌లోని తన అధికారిక నివాసంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ముందుగా రక్షణ అధికారులు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంజలి ఘటించారు. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు తదితరులు ప్రణబ్ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన కుమారులు, కూతురును పరామర్శించారు. 

 Pranab Mukherjee funeral
వారితోపాటు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్, అధిర్ రంజ‌న్ చౌద‌రి, గులాం నబీ ఆజాద్, సీపీఐ నాయ‌కుడు డి రాజా, బీజేపీ అధ్యక్షుడు జేపీ న‌డ్డా, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, పలువురు కేంద్ర మంత్రులు, పలుపార్టీలకు చెందిన నాయకులు ప్ర‌ణ‌బ్‌కు నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా వారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారులను, కుమార్తెను పరామర్శించారు.

Vice President M Venkaiah Naidu pays last respects to former President

pranab

 

 

Trending News