Pradhan Mantri Awaas Yojana: రూ. 700 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ప్రధాని మోదీ

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన- మొదటి విడత గ్రామీణ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసిన ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 02:20 PM IST
  • ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన- మొదటి విడత విడుదల
  • 700 కోట్లు రూపాయలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ
  • వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించిన ప్రధాని మోదీ
Pradhan Mantri Awaas Yojana: రూ. 700 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ప్రధాని మోదీ

 Pradhan Mantri Awaas Yojana- Gramin: ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ  (Narendra Modi ) ఈరోజు (ఆదివారం) 1 లక్షా 47 వేల మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ (DBT) ద్వారా రూ.700 కోట్లను బదిలీ చేశారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీన్ (PMAY-G) కింద లబ్ధిదారులకు పక్కా గృహాల కోసం ఈ మొత్తాన్ని విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ,  700 కోట్లు రూపాయలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన తరువాత ప్రసంగించారు. 

Also Read: Curfew in Amaravati: అమరావతిలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. 4 రోజుల పాటు కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్

 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీన్ (Pradhan Mantri Awas Yojana- Gramin) కింద మొదటి విడతను బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసిన తర్వాత, ప్రధాని మోదీ లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంతకు ముందు ప్రభుత్వ పథకంలో కొంత మంది మాత్రమే లబ్ధి పొందేవారని, గత 7 సంవత్సరాలుగా, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనేదే మా ప్రయత్నమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News