క్షమాపణ పిటీషన్ తిరస్కరించిన రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తను పదవిలోకి వచ్చాక.. తన వద్దకు చేరిన తొలి క్షమాపణ పిటీషనును పరిశీలించి దానిని తిరస్కరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటనను కూడా విడుదల చేసింది.

Last Updated : Jun 3, 2018, 09:06 PM IST
క్షమాపణ పిటీషన్ తిరస్కరించిన రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తను పదవిలోకి వచ్చాక.. తన వద్దకు చేరిన తొలి క్షమాపణ పిటీషనును పరిశీలించి దానిని తిరస్కరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఓ కుటుంబంలోని ఏడుగురు వ్యక్తులను అతి దారుణంగా హత్య చేసిన ఘటనలో జగత్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

అనేక పర్యాయాలు ఈ కేసులో విచారణ జరిగిన అనంతరం ఎట్టకేలకు భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు నిందితుడికి మరణ శిక్షను విధించింది. ఇటీవలే ఈ తీర్పును సవాలు చేస్తూ.. జగత్ రాయ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నారు. ఈ క్షమాభిక్ష  పిటీషనును పరిశీలించిన రాష్ట్రపతి దానిని తిరస్కరించారు. ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతికి ఏ కేసులోనైనా సరే నిందితులకు క్షమాభిక్షను ప్రసాదించే అధికారం ఉంటుంది. గతంలో కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన వద్దకు వచ్చిన 30 క్షమాభిక్ష పిటీషన్లను తిరస్కరించారు. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x