Selfie: సెల్ఫీ కోసం నదిలోకి దిగిన యువతులు

నీటి ప్రవాహంలోకి దిగి సెల్ఫీ ( Selfie ) తీసుకోవాలని ఇద్దరు యువతులు చూపిన అత్యుత్సాహం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. నదిలోకి దిగి సెల్ఫీ తీసుకునే క్రేజ్‌లో పడిన ఇద్దరు యువతులు.. నదిలో పెరుగుతున్న ప్రవాహాన్ని పట్టించుకోలేదు.

Last Updated : Jul 25, 2020, 05:03 AM IST
Selfie: సెల్ఫీ కోసం నదిలోకి దిగిన యువతులు

భోపాల్: నీటి ప్రవాహంలోకి దిగి సెల్ఫీ ( Selfie ) తీసుకోవాలని ఇద్దరు యువతులు చూపిన అత్యుత్సాహం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. మధ్యప్రదేశ్‌లోని చింద్‌వాడ జిల్లా బెల్‌ఖేడి గ్రామ సమీపంలో తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... చింద్‌వాడ జిల్లాలోని జునార్‌దేవ్ పట్టణానికి చెందిన ఆరుగురు యువతులు విహార యాత్ర కోసమని పెంచ్ నది ( Pench river ) వద్దకు వెళ్లారు. వారిలో ఇద్దరు యువతులు నదిలోకి దిగి సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలోనే వరద ఉదృతి పెరిగింది. నదిలోకి దిగి సెల్ఫీ తీసుకునే క్రేజ్‌లో పడిన ఇద్దరు యువతులు.. నదిలో పెరుగుతున్న ప్రవాహాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా నది ప్రవాహంలోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ( Also read: RGV: పరాన్న జీవి టీజర్‌పై వర్మ కౌంటర్ )

Pench river లో ఇద్దరు యువతులు చిక్కుకున్నారని గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. గ్రామస్తుల సహాయంతో అతి కష్టం మీద వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. Telangana: 24 గంటల్లో 1640 కరోనా కేసులు

Trending News