కాఫీ రుచి చూసిన ప్రధాని మోదీ

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ తో సహా మరి కొంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

Last Updated : Dec 27, 2017, 04:28 PM IST
కాఫీ రుచి చూసిన ప్రధాని మోదీ

షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ తో సహా మరి కొంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా తో పాటు గుజరాత్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మోదీ ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యాక్రమం ముగిశాక సడన్ గా షిమ్లా మాల్ రోడ్ వద్ద టీ తాగుతూ కనిపించారు.

హిమాచల్ ప్రదేశ్ కొత్త క్యాబినెట్ వేడుకలో పాల్గొని తిరిగి హెలీపాడ్ వద్దకు వెళ్ళే మార్గంలో ఇండియన్ కాఫీ హౌస్ లో వేడివేడి కాఫీ తాగటానికి మోదీ కారును ఆపారు. అనేక సంవత్సరాల క్రితం హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ సంబంధిత బాధ్యతలు నిర్వహించేటప్పుడు..  మోదీ ఈ కాఫీ షాప్ లోనే తరచూ గడిపేవారు. ఇక్కడికి వచ్చి కాఫీ తాగేవారని అనాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. ప్రధానమంత్రి మోదీ మాల్ రోడ్ లో కాఫీని తాగుతుండటం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆయనతో కరచాలం చేయడానికి,  సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు. 

 

Trending News