ప్రణయ్ పరువు హత్యపై హీరోయిన్ పూనమ్ కౌర్ రియాక్షన్

                                                        

Last Updated : Sep 17, 2018, 08:14 PM IST
ప్రణయ్ పరువు హత్యపై హీరోయిన్ పూనమ్ కౌర్ రియాక్షన్

నల్గొండ: మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ పరువు హత్యపై  హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ లో స్పందించింది. ఈ ఘటన తన మనసును ఎంతగానో కలచివేస్తోందని పూనమ్ ఆవేదన వ్యక్తం చేసింది. 21వ శతాబ్దంలో కూడా మనం కులం మతం అని పట్టించుకోవడం ఏంటని ప్రశ్నించింది. కుమార్తె అమృతను పెళ్లి చేసుకున్న ప్రణయ్ ను వేరే కులం వాడనే ఒకే ఒక్క కారణంతో అతన్ని ఇలా కిరాతకంగా హత్య చేయించడంపై దారుణమన్న కౌర్... ఈ ఘటన తన హృదయాన్ని కలచివేస్తోందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో స్పందించింది.

పూనమ్ మాటల్లో చెప్పాలంటే " అసలు జనాలు ప్రేమకు వ్యతిరేకంగా ఎందుకు ఉన్నారు..? ప్రణయ్ హత్య, అమృత రోదన నా మనసును కలచివేస్తోంది,  ఇలాంటి పనుల ద్వారా మనం ఏం సాధించగలం ? మనం నిజంగానే 21వ శతాబ్దంలో ఉన్నామా? అమృత-ప్రణయ్ జంటకు న్యాయం జరిగేది ఎప్పుడు?' అని పూనమ్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా  అమృత-ప్రణయ్ ల ప్రీ వెడ్డింగ్ షూట్  వీడియో లింక్ ను ఈ ట్వీట్ కు పూనమ్ కౌర్  జత చేసింది..

 

 

Trending News