Sai Dharam Tej: యావరేజ్ సినిమాకి సీక్వెల్ తీయనున్న సాయి ధరమ్ తేజ్.. ఇదేందయ్యా ఇది!!

Kishore Tirumala: విరూపాక్ష చిత్రంతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ సడన్గా సైలెంట్ అయిపోయాడు. అతను నెక్స్ట్ మూవీ గంజా శంకర్ నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్ రాకపోవడంపై పలు రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2024, 06:40 PM IST
Sai Dharam Tej: యావరేజ్ సినిమాకి సీక్వెల్ తీయనున్న సాయి ధరమ్ తేజ్.. ఇదేందయ్యా ఇది!!

Chitralahari Sequel: పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో 2014లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన మెగా హీరో సాయిధరమ్ తేజ. మొదటి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడంతో ఇతని కెరియర్ అలాగే కొనసాగుతుంది అని అందరూ భావించారు. అయితే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దకాలం పూర్తి అవుతున్న అతని కెరియర్లో బ్లాక్బస్టర్లను వేల మీద లెక్కపెట్టవచ్చు. రీసెంట్గా అతను నటించిన విరూపాక్ష సినిమా అతనికి సాలిడ్ కమ్ బ్యాక్ అందించింది.

ఆ తర్వాత సుప్రీం హీరో తన నెక్స్ట్ మూవీ గంజా శంకర్ అని అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ రేంజ్ లో ఈ గంజా శంకర్ కూడా ఉంటుంది అని అభిమానులు ఆశించారు. అయితే ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. మరోపక్క ఈ మూవీ బడ్జెట్ కారణాలవల్ల ఆగిపోయింది అని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ గా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ మూవీ నుంచి విడుదలైన టైటిల్ ,టీజర్ కంటెంట్ అభ్యంతరకరంగా ఉంది అంటూ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పేర్కొంది. పైగా ఈ విషయంపై నోటీసులు కూడా రావడంతో చిత్ర బృందం ఆలోచనలో పడిందని టాక్.

సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ హై వోల్టేజ్ మూవీలో మొదట హీరోయిన్ గా పూజ హెగ్డే తీసుకుంటున్నారు అని టాక్ వచ్చింది. ఆ తరువాత రెమ్యూనరేషన్ ప్రాబ్లం కారణంగా పూజ తప్పుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గంజా శంకర్ మూవీ పరిస్థితిపై ఎవరికీ క్లారిటీ లేదు. అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చేటంతవరకు ఈ మూవీకి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ తెలియదు. అయితే ఈ మధ్యలో సాయి ధరమ్ తేజ కెరీర్ వరస ప్లాపులు ఉన్నప్పుడు ఒక సుమారు విజయం అందించిన చిత్రలహరి కు సీక్వెల్ తీయడానికి మైత్రి మూవీ మేకర్స్ చూస్తున్నారట 

ఈ మూవీ డైరెక్టర్ కిషోర్ తిరుమల ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనిలోనే ఉన్నట్లు టాక్. కిషోర్ తీసిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దానికి ముందు తీసిన రెడ్ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. ఈ నేపథ్యంలో అతని చేతికి వచ్చిన ఒక స్టార్ హీరో చిత్రం కూడా జారిపోయిందట. దీంతో ఎలాగైనా తిరిగి తన క్రేజ్ వెనక్కి తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో కిషోర్ తిరుమల చిత్రలహరి 2 స్క్రిప్ట్ ని ఎక్స్ట్రార్డినరీగా డిజైన్ చేస్తున్నారట.

ఈ మూవీకి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని.. సాయి ధరమ్ తేజ మార్కెట్ పరిమితి మించకుండా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారట. మూవీ పేరుకే సీక్వెల్ కానీ కథ మాత్రం కంటిన్యూటీ ఉండకపోవచ్చు అని టాక్. టైటిల్ మాత్రమే చిత్రలహరి 2 అని పెట్టి స్టోరీని పూర్తి ఫ్రెష్ కంటెంట్తో తెరకెక్కించే ఉద్దేశంతో చిత్ర బృందం ఉన్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుంది.  ఇదంతా బాగానే ఉన్నా అభిమానులు మాత్రం అసలు ఈ సినిమాకి సీక్వెల్ అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్ వరస ప్లాపుల లో ఉన్నప్పుడు ఈ చిత్రం ఒక యావరేజ్ హిట్ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే కాదు. మరి అలాంటి ఆ సినిమాకి ఇప్పుడు మళ్లీ సీక్వెల్ అవసరమా అనేది అందరి సందేహం. అది కూడా ప్రస్తుతం అందరూ డిఫరెంట్ కాన్సెప్టులు తీసుకుంటూ ఉంటే రొటీన్ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రలహరి కి సీక్వెల్ ఇప్పుడు ప్రేక్షకులు చూస్తారా అనేది కూడా ఒక పెద్ద సందేహమే.

Also Read: Mallu Ravi: తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం.. సంచలనం సృష్టించిన మల్లు రవి రాజీనామా

Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్‌ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్‌, రుణమాఫీ ఎప్పటినుంచంటే?

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News