Nowhera Shaikh: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా నిలిచిన హైదరాబాద్ లోక్సభ స్థానంలో మరొకరు పోటీలోకి వచ్చారు. అసదుద్దీన్, మాధవీలతకు పోటీగా హీరా గ్రూపు వ్యవస్థాపకురాలు నోహెరా షేక్ వస్తున్నారు. ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాక పాతబస్తీని బంగారు బస్తీగా మారుస్తానని హామీ ఇచ్చారు. అసదుద్దీన్ ఆగడాలకు చెక్ పెడతానని చెప్పారు. నౌహెరా షేక్ ఇటీవల బండ్ల గణేశ్ నివాసం విషయమై గొడవ జరిగిన విషయం తెలిసిందే. గతంలో ఆమె కంపెనీ ఆస్తులపై కేంద్ర సంస్థలు దాడులు చేసి ఆస్తులు అటాచ్ చేశాయి.