Kumari Aunty: సోషల్ మీడియా స్టార్ కుమారి ఆంటీ సంచలనం.. రేవంత్‌ రెడ్డికి రూ.50 వేలు విరాళం

Kumari Aunty Donates Rs 50k To Telangana CMRF: సోషల్‌ మీడియా స్టార్‌గా నిలిచిన కుమారి ఆంటీ మరో సంచలనం రేపారు. రేవంత్‌ రెడ్డిని కలిసి రూ.50 వేల విరాళం అందించారు. వరద బాధితుల కోసం ఆమె సహాయం అందించగా.. ఎప్పటి నుంచో రేవంత్‌ రెడ్డిని కలవాలనే ఆమె కోరిక తీరింది.

1 /8

Kumari Aunty Revanth Reddy: రోడ్డుపై ఫుడ్‌ స్టాల్‌ నిర్వహించుకుంటూ యూట్యూబ్‌ చానల్స్‌ ద్వారా ట్రెండింగ్‌లోకి వచ్చిన కుమారి ఆంటీ మరో సంచలనం సృష్టించారు. తన వంటకాలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న కుమారి ఆంటీ తన కల తీర్చేసుకున్నారు.

2 /8

Kumari Aunty Revanth Reddy: కుమారి ఆంటీ భర్త, పిల్లలతో సహా రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కుమారి ఆంటీని రేవంత్‌ రెడ్డి సన్మానించారు.

3 /8

Kumari Aunty Revanth Reddy: తెలంగాణ వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం అందించారు. 

4 /8

Kumari Aunty Revanth Reddy: ఎప్పటి నుంచో రేవంత్‌ రెడ్డిని కుమారి ఆంటీ కలవాలనే కోరిక ఉంది. కొన్ని నెలల అనంతరం ఆమె కలవడం విశేషం.

5 /8

Kumari Aunty Revanth Reddy: రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తొలినాళ్లలో కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ పోలీసులు తొలగించడం వివాదం రాజుకుంది.

6 /8

Kumari Aunty Revanth Reddy: కుమారి ఆంటీ స్టాల్‌ కూల్చివేతపై స్వయంగా రేవంత్‌ రెడ్డి స్పందించారు. స్వయంగా వచ్చి కలుస్తానని చెప్పడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

7 /8

Kumari Aunty Revanth Reddy: అప్పటి నుంచి కుమారి ఆంటీ సోషల్‌ మీడియాలో రాజకీయంగా ట్రెండింగ్‌లోకి వచ్చారు.

8 /8

Kumari Aunty Revanth Reddy: తాజాగా రేవంత్‌ రెడ్డి, కుమారి ఆంటీ కలుసుకోవడంతో ఈ పరిణామం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.