Samantha: గడ్డుకాలంలో అమ్మవారినే నమ్ముకున్న సమంత.. దేవీ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు

Actress Samantha Performs Poojas Amid Divorce Row: సినిమాలపరంగా ఎలాంటి ఒడిదుడుకులు లేని సినీ నటి సమంతకు వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వివాహమై విడాకులు పొందిన ఆమెకు కొండా సురేఖ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే సమంత అమ్మవారిని నమ్ముకున్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఆమె దుర్గమాతకు పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

1 /9

దేశవ్యాప్తంగా దసరా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రులు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో సినీ నటి సమంత రూత్‌ప్రభు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు.

2 /9

కుంకుమ రంగు దుస్తుల్లో మెరిసిన సమంత అత్యంత శక్తిశ్రద్ధలతో పూజలు చేసి అమ్మవారి సేవలో నిమగ్నమయ్యారు.

3 /9

ఈషా ఫౌండేషన్‌కు చెందిన లింగ భైరవి ఆలయాన్ని సమంత దర్శించుకున్నారు.

4 /9

తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్‌లో అగ్ర తారగా సమంత రాణిస్తున్న సమయంలో వైవాహిక జీవితంలో అలజడులు.. అనారోగ్యం నేపథ్యంలో ఆమె కొన్నాళ్లుగా ప్రేక్షకులకు దూరమయ్యారు.

5 /9

అయితే వ్యక్తిగత జీవితంలో జరిగిన చేదు అనుభవం సమంతను వెంటాడుతూనే ఉంది.

6 /9

తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన విడాకుల అంశాన్ని రాజకీయ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది.

7 /9

నిస్సిగ్గుగా.. అసభ్యకర రీతిలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సమంత ఖండించారు.

8 /9

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ అంశంలో సమంతను ఇరికించడం క్షమించరాని తప్పుగా సమంత పేర్కొన్నారు.

9 /9

ప్రస్తుతం ఈ వివాదమే సమంతను చుట్టుముట్టింది. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.