కారు కాలువలో పడిన ఘటనలో ఆరుగురు మృతి

కారు కాలువలో పడిన ఘటనలో ఆరుగురు మృతి

Last Updated : Oct 19, 2019, 03:30 PM IST
కారు కాలువలో పడిన ఘటనలో ఆరుగురు మృతి

సూర్యాపేట: నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడిపోయిన స్కార్పియో వాహనం ఆచూకీ లభించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలించిన అనంతరం స్థానికుల సహాయంతో కారును కాలువలోంచి వెలికి తీశారు. సూర్యపేట జిల్లా నడిగూడెం మండలంలోని చాకిరాల పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. కారు కాలువలో పడినప్పటికే డోర్స్ లాక్ అయి ఉండటంతో వారు అందులోంచి బయటికి రాలేక అందులోనే తుదిశ్వాస విడిచారు.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోన్న స్నేహితుల బృందం తమ స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తుండగా శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో కారు కాలువలో పడిన సంగతి తెలిసిందే.

Trending News