Haryana Sworn In: హర్యానాలోనూ సీఎం చంద్రబాబుకు 'అమిత' ప్రాధాన్యం.. టీడీపీ శ్రేణుల సంబరాలు

Special Treat For AP CM Chandrababu Naidu In Haryana: హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణస్వీకారంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు అరుదైన గౌరవం లభించింది. వేడుకకు హాజరైన చంద్రబాబుకు కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు ప్రత్యేకంగా ఆహ్వానం పలికి ప్రత్యేక కుర్చీలో కూర్చోబెట్టారు. ఇది చూసి టీడీపీ నాయకులు, కూటమి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

1 /8

హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కొలువుదీరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం కన్నులపండువగా సాగింది.

2 /8

ఈ వేడుకకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై సందడి చేశారు.

3 /8

కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుండడంతో హర్యానాలో కూడా చంద్రబాబు నాయుడికి అపూర్వ గౌరవం లభించింది.

4 /8

వేదికపైకి వచ్చిన చంద్రబాబుకు కేంద్ర మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు.

5 /8

వారిద్దరి మధ్య వేసిన కుర్చీలో చంద్రబాబును కూర్చోబెట్టి గౌరవించడం ఆసక్తికరంగా మారింది. 

6 /8

లోక్‌సభ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు జాతీయ స్థాయిలో అమితమైన గుర్తింపు లభిస్తున్న విషయం తెలిసిందే.

7 /8

కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఏపీకి భారీగా నిధులు, ప్రాజెక్టులు, పనులు జరుగుతున్నాయి. చంద్రబాబు ఏది అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం కాదనకుండా ఇస్తోంది.

8 /8

హర్యానాలో చంద్రబాబుకు దక్కిన గౌరవం చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.