Assistant Director Died: టాలీవుడ్లో విషాదం.. పూరి జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ సూసైడ్..

Puri Jagannadh's Assistant Director Sai Kumar Dies by Suicide: పూరి జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 10, 2022, 11:21 AM IST
Assistant Director Died: టాలీవుడ్లో విషాదం.. పూరి జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ సూసైడ్..

Puri Jagannadh's Assistant Director Sai Kumar Dies by Suicide: గత కొంతకాలంగా టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అనేకమంది నటీనటులు అలాగే ఇతర టెక్నీషియన్స్ కూడా అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

పోలీసులు చెబుతున్న దాని ప్రకారం దుర్గం చెరువులో ఇటీవల సాయి కుమార్ అనే వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయి కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. ఆ తర్వాత పోలీసులు ఆత్మహత్య చేసుకున్న సాయి కుమార్ గురించి ఆరా తీయగా అతను గతంలో పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్లు గుర్తించారు. అయితే ఇప్పుడు పూరీ జగన్నాథ్ దగ్గర పని చేస్తున్నాడా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు.

కానీ ఆయన గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని ఈ నేపథ్యంలోనే ఆ ఇబ్బందులు తట్టుకోలేక దుర్గం చెరువులో దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని మాదాపూర్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఇక ఇటీవలే పూరి జగన్నాథ్ లైగర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా రూపొందిన సినిమాకు చార్మి, పూరి  జగన్నాథ్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరించారు.

అయితే ఎన్నో అంచనాలతో ఆగస్టు 25వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలై డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలిసి చేయాల్సిన జనగణమన సినిమా కూడా ఆగిపోయింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషీ అనే సినిమాతో పాటు దిల్ రాజు కాంబినేషన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

పూరీ జగన్నాథ్ విషయం మీద మాత్రం క్లారిటీ లేదు పూరి జగన్నాథ్ సొంత కుమారుడితో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ అది ఎంతవరకు నిజమనే విషయం మీద మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ప్రస్తుతానికి జరుగుతున్నవన్నీ ప్రచారాలే అవన్నీ పుకార్లే ఇందులో ఏ మాత్రం నిజం లేదని చార్మి కౌర్ తాజాగా ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు.

Also Read: Bigg Boss Telugu 6 Elimination: ఆ ఇద్దరు భామల మీద ఎలిమినేషన్ కత్తి..ఒకరు కన్ఫాం!

Also Read: Galatta Geetu Behaviour: టీషర్టు లోపల చెయ్యి పెట్టుకోండి.. దిగజారి పోతున్న గీతూ ప్రవర్తన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News