చావు తప్పి కన్ను లొట్టబోయిందంటే ఇదేనేమో!

చావు తప్పి కన్ను లొట్టబోయిందంటే ఇదేనేమో!

Last Updated : May 23, 2018, 02:07 PM IST
చావు తప్పి కన్ను లొట్టబోయిందంటే ఇదేనేమో!

చావు తప్పి కన్ను లొట్టబోయిందంటే ఇదేనేమో! ఢిల్లీలో ఓ 21 సంవత్సరాల యువకుడు ప్రమాదకరంగా మెట్రోరైలు పట్టాలను దాటి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

వివరాల్లోకివే వెళితే శాస్త్రినగర్‌ మెట్రో స్టేషన్‌లో మయూర్ పటేల్ అనే యువకుడు 22వ తేదీన ఉదయం సమయంలో.. ఒక ఫ్లాట్ ఫాం నుంచి మరో ఫ్లాట్ ఫాంకు వెళ్లేందుకు ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించకుండా నేరుగా పట్టాల నుంచి దాటుతుండగా.. సరిగ్గా అదే సమయంలో రైలు ప్రయాణం ప్రారంభమైంది.

అవతలి ఫ్లాట్ ఫాంపైకి ఎక్కే ప్రయత్నంలో ఉన్న యువకుడిని రైలు తాకగానే అప్రమత్తమైన లోకోపైలెట్ రైలును ఆపేయడంతో అతడికి ప్రాణాప్రాయం తప్పింది. దీంతో మయూర్‌కి జరిమానా విధించడంతో ఎందుకిలా చేశావంటూ అధికారులు ప్రశ్నించారు. ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంకు ఎలా వెళ్లాలో తనకు తెలీదని, అందుకే ట్రాక్‌ దాటి వెళ్లేందుకు ప్రయత్నించానని మయూర్ తాపీగా సమాధానం చెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్‌ అయ్యాయి.

 

Trending News