భార్య మోసం చేసిందని భర్త సెల్ఫీ సూసైడ్

                                      

Last Updated : May 28, 2018, 10:48 PM IST
భార్య మోసం చేసిందని భర్త సెల్ఫీ సూసైడ్

భార్య మోసం చేసిందని మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఆత్మహత్య దృశ్యాన్ని మొబైల్‌లో చిత్రీకరించాడు .ఈ సెల్ఫీ సూసైడ్‌ మధ్యప్రదేశ్‌లోని ఛటర్‌పూర్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. 

ప్రముఖ మీడియా కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మధ్యప్రదేశ్‌ ఛటర్‌పూర్‌ జిల్లా గంజ్‌ గ్రామానికి చెందిన తులసీదాస్‌ పాటిల్ పెద్దలను ఎదిరించి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మెడికల్‌ క్లీనిక్‌ పెడతానంటే ఇంటిని అమ్మి 2లక్షల డబ్బు సహాయం చేశాడు. ఇంతలో ఏం జరిగిందో మరి .. ఆమె భర్తతో తెగదెంపులు చేసుకొని విడిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గరైన తులసీదాస్‌ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన చావుకు కారణాలను తెలుపుతూ వీడియో సెల్ఫీ తీసి దాన్ని అతని బావకు పంపాడు.

తులసీదాస్ పంపిన వీడియోలో ఇలా పేర్కొన్నాడు.. ‘‘ ప్రాణంగా ప్రేమించిన ఆమె నన్ను దూరంగా పెడుతోంది. ఆమెకు కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేయడానికి సిద్దపడుతున్నారు. ఆమె బంధువులతో గొడవపడేంత ధైర్యం నాకు లేదు అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను.

ఆలస్యంగా ఈ వీడియో చూసిన తులసీదాస్‌ బావ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఇంట్లో భద్రపరిచిన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు, మ్యారేజ్‌ సర్టిఫికేట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Trending News