7th Pay Commission: గుడ్ న్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. 7వ పే కమిషన్ చేసిన సూచనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

  • Dec 15, 2020, 21:39 PM IST

న్యూ ఢిల్లీ: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. 7వ పే కమిషన్ చేసిన సూచనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 వ్యాప్తికి ముందు వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 21 శాతం డియర్‌నెస్ అలవెన్స్ వర్తించగా కొవిడ్-19 కారణంగా డిఏను 17 శాతానికి తగ్గించారు. వచ్చే ఏడాది జూన్ వరకు ఇదే విధానం అమలులో ఉండనుండగా ఆ తర్వాత మళ్లీ కేంద్రం డియర్‌నెస్ అలవెన్స్ ( Dearness allowance ) విధానాన్ని సవరించి వారి డిఏ శాతాన్ని పెంచనుంది.

1 /5

డియర్‌నెస్ అలవెన్స్ పెంచిన కారణంగానే వచ్చే ఏడాది జూన్ తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. ప్రతీ సంవత్సరం జూలై నెలలో డియర్‌నెస్ అలవెన్స్‌లను సవరిస్తున్న సంగతి తెలిసిందే.

2 /5

కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus pandemic ) కారణంగా ఎదురైన ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ఈ ఏడాది డియర్‌నెస్ అలవెన్స్ శాతాన్ని తగ్గించిన కేంద్రం.. ఆ తర్వాత 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్ అందించింది. అంతేకాకుండా ఎల్టీసీ, ఎల్టీఏలనూ పెంచింది.

3 /5

డిఏ తగ్గిందన్న నిరుత్సాహంతో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే కేంద్రం అప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది.

4 /5

ఎల్టీసీ క్యాష్ ఓచర్ స్కీమ్‌ ( LTC cash voucher scheme ) శాతాన్ని సైతం పెంచినట్టు కేంద్రం అక్టోబర్ 12న వెల్లడించింది.

5 /5

కేంద్రం తరహాలోనే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఏ శాతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెరిగిన డిఏ ఫలాలు ( DA benefits ) అందనున్నాయి.