Lathi Charge: అశోక్‌నగర్‌లో అభ్యర్థులపై విరిగిన లాఠీ.. ఒళ్లంతా దెబ్బలు చూస్తే కన్నీళ్లే

Police Lathi Charge On Group 1 Aspirants At Ashok Nagar: తెలంగాణ పోలీసులు అమానుషంగా.. కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మెయిన్స్‌ పరీక్ష వాయిదా కోరుతున్న గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. విద్యార్థులు బట్టలు చింపి.. ఈడ్చుకెళ్తూ దారుణంగా వ్యవహరించడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఫొటోలు చూస్తే కన్నీళ్లే వస్తాయి.

1 /9

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతోంది. రేవంత్‌ రెడ్డి దుర్మార్గంగా ముందుకెళ్తున్నారు.

2 /9

పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ అశోక్‌నగర్‌లో విద్యార్థులు చేస్తున్న ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది.

3 /9

కోచింగ్‌కు అడ్డాగా ఉన్న అశోక్‌నగర్‌లో రోజురోజుకు పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. 

4 /9

పరీక్ష వాయిదా కోసం మూడో రోజు శుక్రవారం ఆందోళన చేపట్టగా పోలీసులు దారుణంగా.. కర్కశంగా వ్యవహరిస్తున్నారు.

5 /9

హైదరాబాద్ లోని అశోక్ నగర్ చౌరస్తాలో భారీగా మోహరించిన పోలీసులు ఒక్క విద్యార్థి కనిపించినా వెంటనే అత్యంత అమానుషంగా తీసుకెళ్లి అరెస్ట్‌లు చేస్తున్నారు.

6 /9

ఈ క్రమంలో విద్యార్థులను ఈడ్చుకుంటూ.. తొక్కుతూ.. పిడిగుద్దులు కొడుతూ తీసుకెళ్తుండడంతో పోలీసుల వ్యవహారంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

7 /9

పోలీసుల దాడిలో విద్యార్థులకు తీవ్ర గాయాలవుతున్నాయి. బట్టలు చినిగిపోవడంతో విద్యార్థులు అవమానంగా భావిస్తున్నారు.

8 /9

తమకు హామీలిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఫేస్‌ మాస్క్‌లు పెట్టుకొని గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేపట్టడం గమనార్హం.

9 /9

ఉన్నత చదువులు చదివి తమకు ఉద్యోగాలు అడిగితే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇలా దాడులు చేయడంపై విద్యార్థి లోకంతోపాటు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.