కోహ్లీ సేన జైత్రయాత్రకు బ్రేక్..రెండో టి 20లో ఓటమి

Last Updated : Oct 11, 2017, 11:46 AM IST
కోహ్లీ సేన జైత్రయాత్రకు బ్రేక్..రెండో టి 20లో ఓటమి

టీమిండియా జైత్ర యాత్రకు బ్రేక్ పడింది.. గువాహటిలో జరిగిన రెండో టి 20 మ్యాచ్ లో భారత్ పై ఆసీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవరల్లో 118 పరుగులకే ఆలౌట్ అయింది.  భారత బ్యాట్స్ మెన్లను బోల్తా కొట్టించడంలో బెరెన్‌డార్ఫ్‌ (4/21) కీలక పాత్ర పోషించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. మూడు మ్యాచుల టి-20 సిరీస్ లో భారత్, ఆసీస్ జట్లు చెరో మ్యాచ్ నెగ్గి సమాన స్థితిలో నిలిచాయి. సిరీస్‌ ఫలితం ఉప్పల్‌లో శుక్రవారం జరిగే మూడో టీ20లోనే తేలనుంది. దీంతో భారత్ - ఆసీస్ మధ్య హైదరాబాద్ లో జరగబోయే  చివరి టి20కి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. 

Trending News