పొట్టి క్రికెట్ సిరీస్ భారత్ కైవసం

Last Updated : Nov 9, 2017, 05:12 PM IST
పొట్టి క్రికెట్ సిరీస్ భారత్ కైవసం

తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టి-20 మ్యాచ్ లో కివీస్ పై భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అడ్డుపడటంతో మ్యాచ్‌ను అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రారంభించారు. మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. కాగా తొలుత బ్యాటింగ్ ఆరంభించిన కోహ్లీసేన నిర్ణీత 8 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. మనీష్ పాండే 17, హార్దిక్ పాండ్యా 14 పరుగులతో రాణించారు. కాగా 68 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన కివీస్ జట్టు నిర్ణీత 8 ఓవర్లలో ఆరువికెట్లు కోల్పోయి 61 పరుగులు మాత్రమే చేయగల్గింది. భుమ్రా 2 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్లుకు కూడా తమ వంతు సహాకారం అందించడంతో టీమిండియా విజయం సాధించగల్గింది. కాగా ఈ విజయంతో పొట్టి క్రికెట్ సిరీస్ ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.

Trending News