శ్రేయస్ అయ్యర్ మెరుపులు: కివీస్ పై భారత్ ఘన విజయం

వరుస సిరీస్ విజయాలతో ఊపుమీదున్న భారత్ నేడు ఈడెన్ పార్క్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19 ఓవర్లలో 4 వికెట్లు 

Last Updated : Jan 24, 2020, 11:55 PM IST
శ్రేయస్ అయ్యర్ మెరుపులు: కివీస్ పై భారత్ ఘన విజయం

అక్లాండ్: వరుస సిరీస్ విజయాలతో ఊపుమీదున్న భారత్ నేడు ఈడెన్ పార్క్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచి టీ20 సిరీస్ లో శుభారంభం చేసింది. దీంతో భారత్ ఐదు టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

కెప్టెన్ విరాట్ కోహ్లీ(45) రాణించగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్(56), శ్రేయస్ అయ్యర్(58 నాటౌట్)లు అర్థ సెంచరీలతో మెరుపులు మెరిపించారు. దీంతో భారత్ ఒక ఓవర్ మిగిలుండగానే విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. కివీస్ ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్(30), మన్రో(59) శుభారంభం అందించగా..కెప్టెన్ విలియమ్సన్(51), టేలర్(54)లు అర్థ సెంచరీలతో రాణించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News