కోహ్లీసేన బంపర్ విక్టరీ; భారీ స్కోర్ ముందు తలవంచిన కివీస్

న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది.

Last Updated : Jan 26, 2019, 02:57 PM IST
కోహ్లీసేన బంపర్ విక్టరీ; భారీ స్కోర్ ముందు తలవంచిన కివీస్

మౌంట్ మాంగనూయ్ స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కివీస్ పై 90 పరుగుల తేడాతో గెలుపొందింది. 325 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆది నుంచి కివీస్ ఏమాత్రం పోరాటపటిమ కనబర్చలేకపోయింది. వరస క్రమంలో వికెట్లు కోల్పోతూ 40.2 ఓవర్లలో 234 పరుగులకు చేతులెస్తేసింది. ఫలితంగా మ్యాచ్ ను కోహ్లీసేన కైవసం చేసుకుంది.

కుల్ దీప్ మాయజాలం..

భారత బౌలింగ్ విషయానికి వస్తే కులీదీప్ 4 వికెట్ల పడగొట్టి కివీస్ పతనంలో కీలక పాత్ర పోషించగా భువనేశ్వరర్ , చాహల్ లు చెరో రెండు వికెట్లు తీయగా.. షమీ, జాదవ తలో వికెట్ల తీసి కివీస్ పతనంలో తమ వంతు  పాత్ర పోషించారు. ఇప్పటికే తొలి వన్డేలో గెలుపొందిన టీమిండియా..తాజా గెలుపుతో తన ఖాతాలో మరో గెలుపును వేసుకొంది. కాగా ఈ వన్డేలో సిరీస్ లో 2 -0 తేడాతో కోహ్లీసేన ఆధిక్యంలో నిలిచింది​.
 

Trending News