COVID-19 cases in Telangana | హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం కొత్తగా 237 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 4,974 కి చేరింది. నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC) పరిధిలోనే 195 కేసులు ఉన్నాయి.
How to fight against COVID-19 | లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటి ( మే 16 నుంచి ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. లాక్డౌన్ సడలింపుల ( Lockdown exemptions) అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏవీ జనం పాటించడం లేదని, మాస్కు ధరించడం, సోషల్ డిస్టన్సింగ్ పాటించడం వంటివి చేయకపోగా.. ఒక చోట గుంపుగా ఏర్పడటం లాంటివి చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారని జూన్ 13 నాటి హెల్త్ బులెటిన్లో సర్కార్ పేర్కొంది.
Telangana COVID-19 updates | హైదరాబాద్: తెలంగాణలో బుధవారం కొత్తగా 191 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన వాటిలో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 143 కేసులు నమోదు కాగా.. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 11, రంగారెడ్డి జిల్లాలో 8, మహబూబ్నగర్ జిల్లాలో 4, జగిత్యాల జిల్లాలో, మెదక్ జిల్లాల్లో 3, నాగర్ కర్నూలు, కరీంనగర్ జిల్లాల్లో 2, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
COVID-19 updates | హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం నాడు కొత్తగా 178 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 143 జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే ఉన్నాయి. మిగతా కేసుల్లో రంగారెడ్డి జిల్లాలో 15 కేసులు, మేడ్చల్ జిల్లాలో 10 కేసులు, మహబూబ్నగర్లో జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, మెదక్ జిల్లాలో 2, జగిత్యాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.