మావోయిస్టుల చేతిలో కిడ్నాపైన టీఆర్ఎస్ నేత విడుదల

మావోయిస్టుల చేతిలో కిడ్నాపైన టీఆర్ఎస్ నేత విడుదల

Last Updated : Jul 13, 2019, 01:20 AM IST
మావోయిస్టుల చేతిలో కిడ్నాపైన టీఆర్ఎస్ నేత విడుదల

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని చర్ల మండలంలో మాజీ ఎంపిటీసి, టీఆర్ఎస్ స్థానిక నేత నల్లూరి శ్రీనివాస్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారనే వార్త కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే నాలుగు రోజుల క్రితం కిడ్నాపైన నల్లూరి శ్రీనివాస్ శుక్రవారం ఉదయం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. మావోయిస్టులే శుక్రవారం ఉదయం ఆయనను విడుదల చేసినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ క్షేమంగా ఇంటికి రావడంతో ఆయన కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.

Trending News