ఏ ఒక్క హమీనైనా కేసీఆర్ నేరవేర్చారా ? - కరీంనగర్ సభలో అమిత్ షా సూటి ప్రశ్న

                             

Last Updated : Oct 10, 2018, 06:11 PM IST
ఏ ఒక్క హమీనైనా కేసీఆర్ నేరవేర్చారా ? - కరీంనగర్ సభలో అమిత్ షా సూటి ప్రశ్న

ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉద్వేగభరింతంగా ప్రసంగించారు. అంబేడ్కర్‌ మైదానంలో నిర్వహించిన 'సమరభేరి'లో  భారత్ మాతాకీ జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వాగ్దానాలు నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. 

కేసీఆర్ పై  అమిత్ షా సంధించిన విమర్శనాస్త్రాలు : 
* దళితులకు సీఎం చేస్తామని కేసీఆర్ మోసం చేశారు.. మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ కూడా విస్మరించారు.
* లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారు.. ప్రభుత్వ ఖాళీలను కూడా భర్తీ చేయలేకపోయారు
*  పేదలకు 2 లక్షల కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇస్తామని చెప్పి 5 వేల ఇళ్ల నిర్మాణం కూడా చేయలేదు.. కేంద్రం నిధులు కూడా ఉపయోగించలేదు
* కేసీఆర్ హయంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు.. కేంద్రం ఇచ్చిన కోట్ల నిధులను దుర్వినియోగం 
* రైతులు ఆత్మహత్యకు కారణం కేసీఆర్ బాధ్యత వహించాలి..

ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఏ ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేకపోయారని..ఏ వర్గానికి ఆయన సరైన న్యాయం చేయలేకపోయారని అమిత్ షా విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్ ను ఎందుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా అమిత్ షా ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేస్తే తెలంగాణను అభివృద్దిపథంలో నడిపించి చూపుతామని ఈ సందర్భంగా అమిత్ షా హామీ ఇచ్చారు

ఒకప్పుడు బీజేపీకి కరీంనగర్‌లో జిల్లాలో మంచి పట్టుండేది. ఈ నేపథ్యంలో అక్కడ పార్టీ వైభవాన్ని తిరిగి సాధించాలన్న బీజేపీ చీఫ్‌ పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాగా అంతకుముందు మధ్యాహ్నం  బెగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా..నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఆయా నియోజక వర్గాల బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన నేరుగా కరీంనగర్‌ వచ్చారు
 

Trending News