తెలంగాణ విషయంలో తన కోరికను బయటపెట్టిన చంద్రబాబు నాయుడు

బంగారు తెలంగాణే తన కోరిక : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

Last Updated : Nov 28, 2018, 09:04 PM IST
తెలంగాణ విషయంలో తన కోరికను బయటపెట్టిన చంద్రబాబు నాయుడు

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్ల హైదరాబాద్‌కి ఏం ఒరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. కేసీఆర్ మెట్రో రైలు ప్రాజెక్టుకు అడ్డంపడటం తప్ప చేసిందేమీ లేదని, అందువల్లే హైదరాబాద్‌కు మెట్రోరైలు ప్రాజెక్టు ఆలస్యమైందని చంద్రబాబు ఆరోపించారు. తానెప్పుడూ టీఆర్‌ఎస్‌ గురించి చెడుగా మాట్లాడలేదని.. అయినాసరే తన పేరెత్తితే చాలు కేసీఆర్ ఆవేశంతో ఊగిపోతారని చెబుతూ.. తాను ఏం తప్పు చేశానో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో బుధవారం జరుగుతున్న ప్రజా కూటమి సభలో పాల్గొని మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని, తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే తన ఏకైక కోరిక అని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఇన్నేళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీతో పోరాటం చేసిన తాను ఇవాళ ప్రజల అవసరం కోసమే తిరిగి అదే పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డానని కాంగ్రెస్ పార్టీతో కలవడానికి వెనుకున్న కారణాన్ని వివరించారు. కేవలం తన అవరాల కోసమో లేక రాహుల్ గాంధీ అవసరాల కోసమో తాము చేతులు కలపలేదని, ప్రధాని మోదీ పాలనపై విసిగిపోయిన దేశ ప్రజల శ్రేయస్సు కోసమే తాము ఒక్కతాటిపైకి వచ్చామని చంద్రబాబు స్పష్టంచేశారు.

Trending News