కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. జగ్గా రెడ్డి, గండ్ర సహా టీఆర్ఎస్‌లోకి ముగ్గురు ఎమ్మెల్యేలు!

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. జగ్గా రెడ్డి సహా టీఆర్ఎస్ లోకి ముగ్గురు ఎమ్మెల్యేలు!

Last Updated : Apr 21, 2019, 07:31 PM IST
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. జగ్గా రెడ్డి, గండ్ర సహా టీఆర్ఎస్‌లోకి ముగ్గురు ఎమ్మెల్యేలు!

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మరో కోలుకోలేని షాక్ తగలనుందా అంటే అవుననే తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా తాజా కథనం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా పేరున్న ముగ్గురు ఎమ్మెల్యేలు త్వరలోనే హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కనున్నట్టు సమాచారం అందుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొన్న జాబితాలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పీ వీరయ్య ఉన్నారు. టీఆర్ఎస్ వర్గాలు శనివారం తెలిపిన సమాచారం మేరకు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు 24వ తేదీన టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది అని ఆ వార్తా కథనం పేర్కొంది.

జగ్గా రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, పి వీరయ్య వెళ్లి టీఆర్ఎస్ లో చేరినట్టయితే, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ వీడిన వారి సంఖ్య మొత్తం 13కి చేరుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మొత్తం 19 స్థానాలు మాత్రమే గెల్చుకోగా 13 ఎమ్మెల్యేలు పార్టీ వీడితే ఇక ఆ పార్టీలో మిగిలేది మరో ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. ఆ ఆరుగురి జాబితాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, రోహిత్ రెడ్డి, సీతక్క ఉండనున్నారు.

Trending News