ఎవరెవరికి e-Pass తప్పనిసరి, ఎవరు ఇస్తారు ?.. క్లారిటీ ఇచ్చిన DGP మహేందర్ రెడ్డి

How to apply for e-pass in Telangana state: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుండి పది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచే ఈ లాక్‌డౌన్ అమలులోకి రానున్న నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి రావాలంటే ఏమేం కావాలి, ఎవరి నుంచి అనుమతులు తీసుకోవాలి అంటూ అనేక సందేహాలతో పౌరులు అయోమయానికి గురవుతున్నారు. వారి సందేహాలకు సమాధానం ఇస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 12, 2021, 04:21 AM IST
ఎవరెవరికి e-Pass తప్పనిసరి, ఎవరు ఇస్తారు ?.. క్లారిటీ ఇచ్చిన DGP మహేందర్ రెడ్డి

How to apply for e-pass in Telangana state: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుండి పది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచే ఈ లాక్‌డౌన్ అమలులోకి రానున్న నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి రావాలంటే ఏమేం కావాలి, ఎవరి నుంచి అనుమతులు తీసుకోవాలి అంటూ అనేక సందేహాలతో పౌరులు అయోమయానికి గురవుతున్నారు. వారి సందేహాలకు సమాధానం ఇస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ నుండి వేరే రాష్ట్రాలకూ, రాష్ట్రంలోనే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందచేసే ఈ- పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు https://policeportal.tspolice.gov.in/ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి అప్లై చేసుకోవాలని సూచించారు. 

అత్యవసర పరిస్థితుల్లో లాక్‌డౌన్ (Lockdown) సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించేవారికి మాత్రమే ఈ-పాసులను జారీ చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టంచేశారు. ఎక్కడి వారికి అక్కడి స్థానిక పోలీస్ కమీషనర్లు, ఎస్పీలకు మాత్రమే పాస్‌లను జారీ చేసే అధికారం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఒక కమిషనరేట్ నుండి మరో కమిషనరేట్ పరిధిలోకి వెళ్లే వారికి.. ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమీషనరేట్ నుండే పాసులు పొందాల్సి ఉంటుందన్నారు. 

Also read: Telangana సరిహద్దుల్లో అంబులెన్సులు ఆపొద్దు: తెలంగాణ హై కోర్టు

ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చే వారి విషయానికొస్తే.. వారు ఎక్కడి నుంచి అయితే తెలంగాణకు వస్తున్నారో, అక్కడి నుంచే ఈ-పాస్‌లు పొందాల్సి ఉంటుందని అన్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపు లాక్‌డౌన్ (Lockdown) సడలింపు సమయంలో ఇంటి నుంచి బయటికొచ్చే వారికి ఏ విధమైన ఈ-పాసులు (e-pass rules in Telangana) అవసరం లేదని డీజీహీ మహేందర్ రెడ్డి తేల్చిచెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News