Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య కలకలం..!

Honour Killing: నాగరాజు పరువు హత్య మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌ బేగం బజార్‌ షాహీనాథ్‌ గంజ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. కత్తులు, రాళ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 09:09 PM IST
  • హైదరాబాద్‌లో మరో పరువు హత్య
  • యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి
  • ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య కలకలం..!

Honour Killing: నాగరాజు పరువు హత్య మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌ బేగం బజార్‌ షాహీనాథ్‌ గంజ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. కత్తులు, రాళ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రేమ వివాహం చేసుకున్నారన్న కక్షతో దాడి చేసినట్లు తెలుస్తోంది. బేగంబజార్‌లోని మచ్చి మార్కెట్‌లో ఘటన జరిగింది. మృతుడు ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తరపు కుటుంబసభ్యులు, బంధువులు కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ..మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి శరీరంపై 10 నుంచి 20 కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. పరువు హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also read:Kiran Kumar Reddy: ఏపీపై సోనియా గాంధీ ఫోకస్..తదుపరి పీసీసీ చీఫ్‌ ఎవరంటే..!

Also read:MS Dhoni IPL Retirement: అలా చేస్తే.. చెన్నై అభిమానులు ఫీల్ అవుతారు! ఐపీఎల్ 2023లో ఆడుతా: ఎంఎస్ ధోనీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.'

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News