Bridegroom Died: కాసేపట్లో పెళ్లి.. వడదెబ్బతో పెళ్లి కొడుకు మృతి

Bridegroom Died due to Sun stroke: వడదెబ్బతో పెళ్లి కొడుకు మృతి చెందిన ఘటన తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో వరుడి కుటుంబ విషాదంలో మునిగిపోయింది. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2023, 06:31 PM IST
Bridegroom Died: కాసేపట్లో పెళ్లి.. వడదెబ్బతో పెళ్లి కొడుకు మృతి

Komaram Bheem Crime: పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు వడదెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటన తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..
కుమురం భీం జిల్లా కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన గుండ్ల శ్యాంరావ్‌-యశోద దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరిలో పెద్ద కుమారుడు తిరుపతి (32). ఇతడికి మంచిర్యాల జిల్లా భీమినికి చెందిన అమ్మాయితో పెళ్లి  కుదిరింది. బుధవారం పెళ్లి జరగాల్సి ఉంది.  గుడ్లబోరిలో వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అప్పటి వరకు పెళ్లి పనుల్లో బిజీగా గడిపిన తిరుపతికి మంగళవారం వడదెబ్బ గురయ్యాడు. దీంతో అస్వస్థతకు గురైన తిరుపతిని మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కాగజ్‌నగర్‌కు తరలించారు. మంగళవారం అర్ధరాత్రి మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ తిరుపతి కన్నుమూశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. గుండ్ల శ్యాంరావ్‌ చిన్న కుమారుడు గుడ్లబోరి సర్పంచిగా చేశాడు. అతడు గతేడాది అనారోగ్యంతో మృతి చెందాడు. తాజాగా పెద్ద కుమారుడు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. 

Also Read: Mobile Phone Explodes: డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతుండగా పేలిన మొబైల్.. బోల్తా పడిన ట్రాక్టర్, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News