ప్రధాని మోడీ, రాహుల్ లకు కేటీఆర్ ధీటైన జవాబు

Telangana Elections 2018: ప్రధాని మోడీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ చేసిన ఆరోపణలపై తెలంగాణ ఆపధార్మ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు

Last Updated : Dec 4, 2018, 06:14 PM IST
ప్రధాని మోడీ, రాహుల్ లకు కేటీఆర్ ధీటైన జవాబు

ప్రధాని మోడీ, రాహుల్ ఆరోపణలకు తెలంగాణ ఆపధార్మ మంత్రి కేసీఆర్ ధీటుగా సమాధానం ఇచ్చారు. ఇరువురు నేతలు ఆరోపిస్తున్నట్లుగా తాము టీం- బీ కాదని.. తమది 'ఏ-టీమ్' అని...ఇది ఎన్నికల తర్వాత తెలుస్తుందని కేటీఆర్ బదులిచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు

ప్రధాని, మోడీ రాహుల్ లను ఉద్దేశించి ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇరువురు జెంటిల్ మెన్స్ తమను బీ టీంగా ప్రచారం చేస్తున్నారు.. మాదే 'ఏ-టీమ్' అని డిసెంబర్ 11న ఎన్నిల ఫలితాల తర్వాత ప్రతి ఒక్కరికీ తెలుస్తుందన్నారు. 

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ తెరాసను కాంగ్రెస్ బీ-టీమ్ అని అభివర్ణించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీకి టీఆర్ఎస్ బీ-టీమ్ అంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ ఈ మేరకు స్పందించారు

 

Trending News