మారుతి రావుకు బెయిల్.. స్పందించిన ప్రణయ్ భార్య అమృత!

తండ్రి మారుతి రావుకు బెయిల్.. స్పందించిన ప్రణయ్ భార్య అమృత!

Last Updated : Apr 28, 2019, 08:32 AM IST
మారుతి రావుకు బెయిల్.. స్పందించిన ప్రణయ్ భార్య అమృత!

మిర్యాలగూడ: గతేడాది తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులుగా వున్న మారుతి రావుకు బెయిల్ లభించడంపై అతడి కూతురు, ప్రణయ్ భార్య అమృత తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. మారుతి రావుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై అసంతృప్తి వెళ్లగక్కిన అమృత.. తన భర్త హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేయడాన్ని కోర్టులోనే సవాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అవసరమైతే, ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించడానికైనా వెనుకాడబోమని చెప్పారామె. 

మిర్యాలగూడ నడివీధుల్లో పట్టపగలే హత్యచేసిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేయడం దారుణం. నిందితులు బయటకు వస్తే తమ కుటుంబానికి ప్రాణహాని మరింత పెరిగినట్టేనని ఆవేదన వ్యక్తంచేసిన అమృత.. తమకు భద్రత పెంచాల్సిందిగా జిల్లా ఎస్పీని కోరినట్టు మీడియాకు తెలిపారు. 

Trending News