రేపటి నుంచే ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నామని అధికారులు స్పష్టంచేశారు.

Last Updated : Jun 6, 2019, 06:51 PM IST
రేపటి నుంచే ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుండి 12 వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు సంబంధిత అధికారులు మరోసారి పునరుద్ఘాటించారు. ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నామని అధికారులు స్పష్టంచేశారు. 

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని సూచిస్తూ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని అధికారులు తేల్చిచెప్పారు.

Trending News