All in One News: అల్ ఇన్ వన్ న్యూస్..!

All in One News: సమూల వార్తల సమాహారమే అల్ ఇన్ వన్ న్యూస్..

  • Zee Media Bureau
  • Sep 11, 2022, 05:37 PM IST

All in One News: హైదరాబాద్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 17 లక్షల విలువైన 50 కేజీల గంజాయి, ఓ కారు, 2 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గుండ్లపల్లి శివారెడ్డి, అలుగుమల్లి హనిమిరెడ్డిగా గుర్తించారు. మేడ్చల్ జిల్లా ఆల్వాల్ మున్సిపల్ పరిధిలోని కానజిగూడ మరకత లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో వినాయకుడి ఉత్సవాలు ముగిశాయి. ఈసందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లడ్డూ వేలం నిర్వహించారు. గణనాథుడి లడ్డూను వెంకట్రావు, గీతాప్రియ దంపతులు 45 లక్షల 99 వేల 999కు వేలం పాడారు. బాలాపూర్‌ లడ్డూ కంటే అధికంగా వేలం పాట అందుకుని రికార్డులోకి ఎక్కింది.

Video ThumbnailPlay icon

Trending News