KCR MUNUGODE MEETING: ఢిల్లీ బ్రోకర్లు చంచల్ గూడ జైళ్లో ఉన్నారు- కేసీఆర్

KCR MUNUGODE MEETING:  కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్‌. ఢిల్లీ బ్రోకర్లను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారన్నారు. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారని మండిపడ్డారు. వందల కోట్ల డబ్బుతో ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి.. ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీకి ఇంకా ఏం కావాలి.. మోదీ రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా.. ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే.. బీజేపీకి చేనేతల నుంచి ఒక్క ఓటు కూడా పోవద్దన్నారు. ప్రలోభాలకు ఆశపడితే గోసపడేది మనమేనని కేసీఆర్ హెచ్చరించారు.

  • Zee Media Bureau
  • Oct 31, 2022, 02:39 PM IST

Video ThumbnailPlay icon

Trending News