మేజర్ టీమ్ ను అభినందించిన యూపీ సీఎం యోగి

  • Zee Media Bureau
  • Jun 22, 2022, 02:06 PM IST

టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘మేజర్’. 26/11/2008న ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడుతూ.. తీవ్రవాదులను అంతమొందించి తన ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఎంతో మంది ప్రశంసలు దక్కించుకున్న ఈ మూవీ.. తాజాగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రధేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ సినిమా చూసి మేజర్ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. మేజర్ సినిమా  టీమ్ .. యూపీ సీఎం కోసం ప్రత్యేకంగా షో వేసారు. ఈ మూవీ చూసి యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ భావోద్వేగానికీ గురయ్యారు. దేశం కోసం ప్రాణాలర్పించిన నిజమైన దేశ భక్తుడి జీవితం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందంటూ మేజర్ సినిమా టీమ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు

Video ThumbnailPlay icon

Trending News