Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్య నేతల మధ్య కోల్డ్ వార్..!

Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. గాంధీభవన్‌ వేదికగా కోల్డ్ వార్ బహిర్గతమైంది. ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 03:05 PM IST

Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలు పోటా పోటీ సమావేశాలు ఏర్పాటు చేశారు. దీనిపై ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రేవంత్ ఆధ్వర్యంలో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. అదే సమయంలో సీఎల్పీ సమావేశాన్ని భట్టి విక్రమార్క ఏర్పాటు చేశారు. దీంతో ఇద్దరి మధ్య వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి.

Video ThumbnailPlay icon

Trending News