Sircilla Crime: ఆదిబట్ల తరహాలోనే సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్

Crime news: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువతి కిడ్నాప్ కు గురైంది. గుడి నుంచి తిరిగివస్తున్న యువతిని కాపు కాసిన గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లారు. అడ్డువచ్చిన బాలిక తండ్రిని కొట్టారు. 

  • Zee Media Bureau
  • Dec 20, 2022, 02:28 PM IST

Crime news: తెలంగాణలో సంచలనం రేపిన ఆదిబట్ల కిడ్నాప్ తరహా ఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ జరిగింది. తందూర్తి మండలం మూడపల్లిలో ఓ యువతి కిడ్నాప్‌కు గురైంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో తండ్రితో కలిసి హనుమాన్ టెంపుల్ కు వెళ్లింది ఓ యువతి. పూజ చేసి తిరిగి వస్తుండగా ఆమెను కిడ్నాప్ చేశారు దుండగులు. అడ్డువచ్చిన యువతి తండ్రిని చితకబాదారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

Video ThumbnailPlay icon

Trending News